పండించిన రైతు పడిగాపులు, సరుకులు అమ్మేందుకు అధికారులుకు,దలాలి లుకు దండాలు పెడుతున్న అన్నదాత!!.
బళ్లారి (22) ఎన్నో కష్టాలు ఎదురించి పగులునక రాత్రి అనక పురుగు పుట్రా ప్రమాదం లెక్క చేయకుండా, అప్పు, సప్పు,చేసి పండించేటువంటి అన్నదాత నేడు దండాలు పెట్టి సరుకులు అమ్ము కొనే పరిస్థితి వచ్చింది.
శుక్రవారం, అనంతపురం జిల్లాల నుంచి కొంత మంది రైతులు బళ్లారి మార్కెట్ కూ వేరుశెనగకాయలు తీసుకువచ్చారు.
అయితే సాయంకాలం అయినా టెండర్లు అవలేదు.
ఎందుకు టెండర్లు అవడం లేదు అని రైతలు మారెక్కెట్టు అధికారులు ను ప్రశ్న చేసారు, అయితే అసలు విషయం బయటకు వచ్చింది.
టెండర్లు దారలు, అంగడి వాళ్ళు మధ్య లో సమస్య ఉందిఅని. సరిపోతుంది అనుకోని సాయంకాలం వరుకు ఉన్నారు అయితే టెండర్ లు కాలేదు.
రైతులు అంగడి వాళ్ళును అధికారులును టెండర్ దారాలును వేడుకొని చేతులు ముక్కి మా సరుకులు కొనండి అని బ్రతిమాలడం జరిగింది.
అయితే అదిగో ఇదిగో అని కథలు చెప్పడం జరిగింది అధికారులు.
బడా టెండర్ దారుడు పాలన్న కోసం అధికారులు, 14.మంది టెండర్ వేసే వాళ్ళు అయినా కోసం ఎదురు చూస్తూ టైమ్ పాస్ చేశారు.
పాలన్న రాయచారులో ఉన్నారు అయినా రావాలి, వచ్చారు సాయంకాలం,
అయితే, టెండర్లు కాలేదు.
*ఎందుకు టెండర్లు కాలేదు, అసలు కథ ఏమిటి ??.*
17/2/2024న Mరమేష్ బాబు ట్రేడర్స్ అనే అంగడికి వేరు శేనగా కాయలు వస్తాయి,ఇదే అంగడి యజమాని అన్న సాయికుమార్ ఎంటర్ ప్రైజస్ ఆనంద్ బాబు టెండర్ వేశారు.Q 7869.రూపాయలుకు, అయితే రైతుకు మాత్రం 7260.రూపాయలుకు పట్టి చేసారని,609 రూ పై బడి ఏమైయ్యింది, ఉసి ఖరీదు కింద రైతులు తో మాట్లాడకోని టెండర్ ఫారం లో కేవలం 5 బస్తాలు కు మాత్రమే ఎక్కువ ధర కట్టి, ఈ అంగడిలో అధిక ధరలు పలుకుతాయి,అని రైతు లను నమ్మిచ్చడం చేసి ఇదే అంగడి లో సరుకులు ఎక్కువ వస్తే వ్యాపారం బాగా జరుగుతుంది అని కమిషన్ వస్తుంది అని, ఇతర అంగడి వాళ్ళు కు దెబ్బ కొట్టడం, ఎదో గోల్మల్ చేయవచ్చు అన్న ఆలోచన ఉంది అని,150 అంగడివాళ్ళు మార్కుకెట్ సెక్రటరీ కీ ఫర్యాదు చేయడం జరిగింది.
అయితే ఉసి ఖరీదుకు అవకాశం లేదు, అలా చేస్తే దండం కట్టాలి, వారికీ కొద్దిరోజులు టెండర్ వేసే అవకాశం ఉండదుఅని, గతంలో కూడా ఇలా చేసిన వారికీ ఇదే శిక్ష జరిగిందిఅని, వీరికి కూడ అదే జరిగితే తప్పు టెండర్లు కు అవకాశం, లేకపోతే లేదుఅని దలాలి వ్యాపారం సంగం అధ్యక్షులు,అంగడి దారాలు తెలిపారు.
పలుమార్లు అధికారులు ప్రయత్నం చేసిన, శుక్రవారం టెండర్లు జరగలేదు. అయితే దీనివెనుక ఏదో గొలుమాల్ ఉంది, అసలు కథ వేరుఉంది. బళ్లారి మా రెక్కెట్ లో రైతులకు పెద్ద ఎత్తున మోసం జరుగుతుంది అని, అక్కడ వ్యాపారంచేసి వాళ్ళు గుస గుసు ఉంది. అధికారులు కూడా ప్రభుత్వంకూ రావాల్సిన సెస్ లో లూటికి పాల్పడుతున్నట్టు కనిపిస్తుంది.
బళ్లారి మార్కెట్ కేవలం ఆధిపత్యం నాయకులు కను సైగల్లో ఉంది. కొన్న సరుకు అమౌంట్ కూడా సక్రమంగా ఇవ్వకుండా1.5% కమిషన్ పట్టుకొని లేటు గా పేమెంట్ల్లు ఇవ్వడం, అడిగితే బయపెట్టడం, కొన్ని కోట్లు టోపీ వేయడం జరిగింది అని,పేరు బయటకు చెప్పని వ్యాపారయజమాని, తెలిపారు. రైతులు పడిగాపులు కస్తూన్నారు.
రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. బళ్లారిలో వేరుశనక్కాయలకు అధిక ధరలు జరుగుతాయి అని ఆలోచనతో అనంతపురం కర్నూలు తదితర వేరే వేరే జిల్లాల నుంచి వస్తారు. రైతులుకు ఇక్కడ దళారులు, టెండర్లు దారుల వ్యవహారాలతో వ్యవస్థ సంపూర్ణంగా సర్వనాశనం అయిపోయింది అని ఆవేదన చెందుతున్నారు. దీనితో రైతుల్లో దిక్కుతోచని పరిస్థితితో అధికారుల దగ్గర కాళ్లు చేతులు పట్టుకోవాల్సిన వాతావరణం ఏర్పడింది. మా వేరుశెనగలు అమ్మితే మా ఊర్లోకి వెళ్ళిపోతాము మీ
సవాసం చాలు నటువంటి వ్యవస్థగా మారిపోయింది.
అయితే ఏపిఎంసి అధికారులు మాత్రం రాజకీయ నాయకుల పైన ఆధారంతో ఇంతవరకు రైతులకు ఎటువంటి న్యాయం చేయకపోవడంతో శుక్రవారం వచ్చిన రైతుల శనివారం వరకు దోమలు మరియు కొన్ని సమస్యలతో రైతులు రోడ్లపై కాసుకునే పరిస్థితి ఏర్పడింది.
కర్నూలు అనంతపురం,ఆదోని ప్రదేశాల్లో వేరుశనక్కాయలు అమ్ముకోవడానికి అవకాశాలు ఉన్న రైతులుకు మాత్రం బళ్లారి పైన నమ్మకం. అయితే ఎక్కడ పరిస్థితి శూన్యం. దీని అసలి కథ ముందు ఉంది.
[video width="960" height="540" mp4="https://news9today.in/wp-content/uploads/2025/02/VN20250222_070056.mp4"][/video]